న్యూ ఢిల్లీ: స్వాతంత్ర్యం అనంతరం తొలిసారి జీడీపీ వృద్ధి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందనేది నిపుణులు హెచ్చరిక. దీన్ని ప్రధాని మోదీ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రంగా సంధించారు. ‘మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే’ అని భాజపా ఎన్నికల నినాదాన్ని జత పరచి ట్వీట్ చేసారు. 1947 తర్వాత జీడీపీ వృద్ధి కనిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. వాస్తవ జీడీపీ 2021 తొలి అర్ధ భాగంలో క్షీణిస్తుందని గతవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు.