గూఢచారి పావురంపై కేసు

గూఢచారి పావురంపై కేసు

అమృత్సర్: పంజాబ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన పావురాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. బీపీవో రోరన్వాలా వద్ద ఈ నెల 17న నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న పావురం కానిస్టేబుల్ నీరజ్ కుమార్ భుజాలపై వాలింది. దాన్ని పట్టుకున్న కానిస్టేబుల్ విషయాన్ని పోస్ట్ కమాండర్ ఓంపాల్ సింగ్కు తెలిపారు. దాని కాళ్లకు అంటించిన పేపర్పై ఒక సంఖ్య రాసి ఉంది. దరిమిలా ఇక్కడి కహాగఢ్ పోలీస్ స్టేషన్లో పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2020 మేలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పాకిస్థాన్కు గూఢ చర్యం చేస్తున్న పావురాన్ని జమ్మూ-కశ్మీర్లోని కథువా జిల్లా అంతర్జాతీయ సరిహద్దు వద్ద పట్టుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos