పిచ్చి కుక్క స్వైర విహారం

పిచ్చి కుక్క స్వైర విహారం

హొసూరు : సూళగిరి తాలూకా కామన్ దొడ్డి గ్రామంలో సోమవారం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పది మంది దాని బారిన పడి గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. ఉదయం నుంచి ఆ కుక్క పలు దఫాలుగా దాడి చేసి గాయపరిచింది. చివరికి గ్రామస్థులు దానిని వేటాడి చంపేశారు.

తాజా సమాచారం