దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్తో ముప్పేట దాడి ఎదుర్కొంటున్న పోలీసులకు తాజాగా మరో చిక్కు వచ్చిపడింది.ఎన్కౌంటర్ బూటకమని దీనిపై విచారణ జరిపించాలంటూ పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను పోలీసులు మార్చురీలో భద్రపరిచారు.ఈనెల 13వ తేదీ వరకు నిందితుల మృతదేహాలు భద్రపరచాలని చెప్పినప్పటికీ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేకపోవడం మరోవైపు నిందితుల మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతుండడంతో పోలీసులు తలలుపట్టుకున్నారు. ఎంబాంబింగ్ చేస్తే మరో రెండువారాలపాటు భద్రపరిచే అవకాశం ఉన్నప్పటికీ రీపోస్టుమార్టానికి అవకాశం ఉండదు.ప్రదేశంలో ఉంచినప్పటికీ మరో వారం వరకు మృతదేహాలు చెడిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా కుళ్లిపోతుంటాయి.కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో తేలేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలిసే పరిస్థితి లేదు. మృతదేహాలను ఏం చేయాలో తెలియక పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.దీంతో ఢిల్లీలోని అధునాతన మార్చురీకి తరలించాలన్న యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.