దిశ రవికి బెయిలు

దిశ రవికి  బెయిలు

న్యూఢిల్లీ : టూల్కిట్ కేసులో నిందితురాలు దిశ రవికి మంగళవారం పటియాలా హౌస్ కోర్టు అడిషినల్ సెషన్ జడ్జి ధర్మేందర్ రాణా బెయిలు మంజూరు చేశారు. రూ.1,00, 000 విలువైన సొంత పూచీకత్తును, అంతే విలువగల రెండు ష్యూరిటీలను ఇవ్వాలని ఆదేశించారు. మరో ఇద్దరు నిందితులు శాంతను ములుక్, నికిత జాకోబ్ ప్రస్తుతం ట్రాన్సిట్ ముందస్తు బెయిలు పై ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం దిశ రవిని ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ కార్యాలయానికి తీసుకెళ్ళారు. శాంతను, నికితలతో కలిపి ఆమెను విచారించేందుకు ఒక రోజు పోలీసు కస్టడీకి కోర్టు సోమవారం అనుమతించింది. ఫిబ్రవరి 21న ఇరు పక్షాల వాదనలను పటియాలా హౌస్ కోర్టు విచారించింది. దిశ రవికి బెయిలు మంజూరు చేయరాదని పోలీసులు కోరారు. ఆమెపై ఆరోపణల్లో పస లేదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసకు, టూల్కిట్కు సంబంధం ఉన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయా? అని జడ్జి ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos