ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం

ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం

ఆలూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం తమకే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తేల్చి చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేక రులతో మాట్లాడారు. ‘ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేస్తుంది. ఇదే హామీతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళతాము. తెలంగాణ విషయంలో హామీని నిలబెట్టుకున్నాం. ఏపీకి ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకుంటాం. ఈ విషయంలో బీజేపీ పార్టీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రులను మోసం చేశా రు. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేదు. భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించాక ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇచ్చామనే విషయం స్వయంగా రాహుల్ గాంధీనే చెబుతారు. విద్వేష రాజకీయాలు, హింసపై పోరాటంలో కాంగ్రె స్ పార్టీతో కలిసి రావాలని తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ అవతల టీఆర్ఎస్ కు గానీ బీఆర్ఎస్ కు చోటేలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కోరికలు ఎక్కువ వుతున్నాయి. భవిష్యత్తులో ఏంజరగనుందో వేచి చూడాల్సిందేన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos