జమ్మూ: ఫూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ సమీపంలో బుధవారం తెల్లవారు జామునకు ముందు రెండు గంటల ప్రాంతంలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో పౌరుడు ఒకరు మరణించారు. మరో పౌరుడు తీవ్రంగా గాయ పడ్డాడు. అతణ్ని ఆసుపత్రికి తరలించారు. 2.45 గంటల ప్రాంతంలో భారత సైనికుల ప్రతి దాడితో పాక్ సైన్యం కాల్పులు నిలిపి వేసింది.