రాత్రికి రాత్రే లక్షాధికారి

రాత్రికి రాత్రే లక్షాధికారి

భోపాల్ : పన్నాకు చెందిన రైతు లఖన్ యాదవ్ గత నెలలో 200 రూపాయలు ఖర్చు పెట్టి ఓ చిన్న స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. శనివారం దాన్ని చదును చేయటానికి పనులు మొదలుపెట్టాడు. దాంట్లోని రాళ్లు, రప్పలు తవ్వి బయటపడేస్తుండగా.. ఓ రంగు రాయి కనిపించింది. దానిని దగ్గరలోని డిస్ట్రిక్ట్ డైమండ్ ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన దాన్ని పరీక్షించి అది 14.98 క్యారెట్ల వజ్రం అని తేల్చాడు. దీంతో యాదవ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దాన్ని వేలం వేయగా 60 లక్షల రూపాయల ధర పలికింది. దీనిపై లఖన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ ఆ వజ్రం నా జీవితాన్ని మార్చేసింది. నేను పెద్దగా చదువు కోలేదు. అందుకే ఆ డబ్బులను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. తద్వారా వచ్చిన డబ్బుతో నా కుమారులకు మంచి చదువులు చెప్పిస్తాను’’ అని అన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos