అమరావతి: సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణపై రాజమండ్రి చెరసాలోల బంధీగా ఉన్న తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ను పోలీసు విచారణ శని వారం విజయవాడకు తరలించారు. ఈ నెల ఐదు వరకూ ఆయన్ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. డెయిరీ అక్రమాలకు సంబంధించి ధూళిపాళ్లను మరిం త లోతుగా విచారించాల్సి ఉన్నందున ఉందని ఆయన్ను తమ స్వాధీనం చేయాలని ఏసీబీ అధికారులు చేసిన వినతిని కోర్టు విచారించి సానుకూలంగా స్పందిం చింది. జైలు వద్ద ఉద్వేగభరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. తండ్రిని చూసి ధూళిపాళ్ల కుమార్తె కంటతడి పెట్టారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినపుడు కారు తలుపు గాజు పలకల్నితెరిచేందుకు పోలీసులు నిరాకరించారు.