చెన్నై : మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డుకు చేరువగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఇప్పటి వరకు 165 మ్యాచులు ఆడిన ధోనీ, 99 మ్యాచుల్లో విజయాలను అందించాడు. ఈరోజు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో సీఎస్కే ఆడాల్సి ఉంది. ఈ మ్యాచులో గెలిస్తే గెలుపు శతకం ధోనీ సొంతమవుతుంది. ఈ సీజన్లో సీఎస్కే ఆరు మ్యాచులు ఆడి, అయిదింటిలో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ అయిదు మ్యాచులు ఆడి, నాలిగింటిలో ఓటమి చవి చూసింది. ఆర్ఆర్పై సీఎస్కే ఎన్నో అలవోక విజయాలు సాధించినప్పటికీ, సొంత గడ్డపై ఆ జట్టుకు మంచి రికార్డే ఉంది.