పురుడు పోసిన ఎమ్మెల్యే

పురుడు పోసిన ఎమ్మెల్యే

ఐజ్వాల్: నాగూర్ గ్రామంలో శాసనసభ్యుడు డాక్టర్ జెడ్ఆర్ థియామ్సంగ ఒక మహిళ కు పురుడు పోసారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. గత సోమవారం నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో డాక్టర్ జెడ్ఆర్ థియామ్సంగ పర్యటించారు. అప్పుడు నాగూర్ గ్రామంలో నెలలు నిండిన గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం అందింది. వృత్తిరీత్యా గైనకాలజీ డాక్టర్ అయిన థియామ్సంగ చాంఫై పట్టణంలోని ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. చాంఫై ఆస్పత్రి వైద్యుడు అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉండటంతో ఆమెకు థియామ్సంగ సీజేరియన్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos