మోదీకి ఓటమి భయం

మోదీకి ఓటమి భయం

అమరావతి: ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీపైనా విరుచుకుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. 20 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చిందని నిలదీశారు. గత ఐదేళ్లలో ప్రధానిగా దేశానికి ఏం చేశారరో మోదీ చెప్పాలని డిమాండు చేసారు. గతాన్ని తవ్వి తలకెత్తుని ఎన్నికల్లో గెలుపొందాలనుకోవడం అవివేకమని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ఓటమి భీతి, నిరుత్సాహాలతో ఆయన ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. భాజపాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని శక్తులను ఏకం చేశామని చెప్పారు. భాజపాకు ప్రత్యామ్నాయాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమని న మ్మకంగా చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos