ముంబై : బాలీవుడ్ తార దీపికా పదుకొనె ర్యాంప్పై నృత్యాలు, మార్జాల నడకలతో అలరించారు. ఓ దుస్తుల బ్రాండ్ 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ముంబైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ దుస్తుల బ్రాండ్ రూపొందించిన గోధుమ రంగ లెహంగాను ధరించి దీపికా తళుక్కుమన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ తారలు అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్, జయా బచ్చన్, ట్వింకిల్ ఖన్నా, సోనాలీ బింద్రే, కరణ్ జోహార్, ముఖేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ, కోడలు శ్లోకా మెహతా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.