అక్రమ సంబంధంతోనే…ఆ ఘోరం

అక్రమ సంబంధంతోనే…ఆ ఘోరం

హొసూరు : కెలమంగలం జీవా నగర్‌లో అగ్నికి ఆహుతై మరణించిన వ్యక్తిని పుదుకోటైకు చెందిన కిశోర్‌ విన్సెంట్‌ (45)గా పోలీసులు గుర్తించారు. మత్తిగిరి సమీపంలోని వృద్ధాశ్రమంలో అతను మేనేజర్‌గా పని చేస్తున్నారు. సుశీలమ్మ అనే మహిళతో గత కొన్ని నెలలుగా అతనికి వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. సుశీలమ్మ ఇంటి ముందు అతను కాలిన గాయాలతో మరణించి ఉండడాన్ని బుధవారం ఉదయం చుట్టు  పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సుశీలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, మృతుని వివరాలు తెలిశాయి. కిశోర్‌ విన్సెంట్‌ ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్యకు గురయ్యాడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos