అమరావతి: మద్యపాన విముఖత కేంద్రాల్లో చేరితే మంచిందని తెదేపా అధిపతి చంద్రబాబు నాయుడుకు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి బుధవారం ట్వీట్లో ఎగతాళి చేసారు. ‘మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబు గోల పెడుతున్నా డు. బిజినెస్ మైండ్ కదా? ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చూస్తాడు. రేట్లు పెంచింది రాబడి కోసం కాదు బాబూ. తాగడం తగ్గించడం కోసం. సీఎం జగన్ గారు జిల్లాకో డీ – అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయించారు. మీరూ నిరభ్యంతరంగా చేరొచ్చు’ అని ట్వీట్ చేశారు.