మోహన్‌బాబు వల్లే నాబిడ్డకు అన్యాయం..దాసరి కోడలు ఆరోపణ..

మోహన్‌బాబు వల్లే నాబిడ్డకు అన్యాయం..దాసరి కోడలు ఆరోపణ..

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చెల్లించలేదంటూ ఆంధ్రప్రదేశ్‌ శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధిపతి మోహన్‌బాబు ప్రభుత్వం ఆరోపణలు చేసిన కొద్ది సేపటికే దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కోడలు సుశీల మీడియా ముందు మోహన్‌బాబుపై ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.ఆస్తి పంపకాల్లో దాసరి నారాయణరావు మనవడికి అన్యాయం జరుగుతోందని అందుకు మోహన్‌బాబు కారణమని సుశీల ఆరోపించారు.దాసరి గారు బతికి ఉన్న సమయంలో ఆస్తులు పంచుతానని చెప్పారన్నారు..అయితే హఠాత్తుగా దాసరిగారు మృతి చెందడంతో మోహన్‌బాబు కల్పించుకొని తాను మధ్యవర్తిగా ఉంటూ ఆస్తుల పంపకాలు చేస్తానని హామీ ఇచ్చారని దాసరి కొడుకు దాసరి అరుణ్‌ కుమార్‌ తమకు తెలిపాడన్నారు.అయితే ఎప్పుడు ఆస్తి పంపకాల విషయం ప్రస్తావించినా మోహన్‌బాబు రావాలంటూ సమాధానం దాటవేస్తున్నాడని ఆరోపించారు.ఇదే విషయం మోహన్‌బాబును అడిగితే తనకు సంబంధం లేదంటూ సమాధానమిస్తున్నారని దాసరి కుటుంబ సభ్యుడినని చెప్పుకొనే మోహన్‌బాబు అదే కుటుంబం వల్ల దాసరి మనవడికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు.సుశీల ఆరోపణలపై దాసరి కొడుకు అరుణ్‌ స్పందిస్తూ..తమ కుటుంబ వివాదంలోకి మోహన్‌బాబును లాగడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos