హైదరాబాద్
: దివంగత దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి వివాదాలను అనేక కారణాల వల్ల పరిష్కరించలేకపోయానని
నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన దాసరి
లఘు చిత్రాల బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. దాసరి వీలునామాలో తనతో పాటు మురళీ
మోహన్ పేరు రాసి, కుటుంబ సభ్యులకు ఆస్తుల పంపకాల్లో సహకరించాలని కోరారని తెలిపారు.
కొంత వరకు అది సాధ్యం కాలేదన్నారు. కాగా తమ కుటుంబ ఆస్తుల పంపకాల్ని తన మామ, మోహన్
బాబు చేతుల్లో పెట్టారని దాసరి కోడలు సుశీల వెల్లడించారు. అయితే ఆయన తమకు అన్యాయం చేశారని
ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నటులు ఆర్. నారాయణమూర్తి, జయసుధ పాల్గొన్నారు.