జైపూర్ : శాసన సభా వ్యవహారాల మంత్రి శాంతి కుమార్ ధారీవాల్ శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకు ముందు సమకాలీన రాజకీయాల గురించి ప్రసంగించారు. తమ ప్రభుత్వాన్ని కేంద్రం డబ్బులు, అధికారాన్ని ఉపయోగించి కూలదోయాలని చూస్తోందని ఆరోపించారు. భాజపా కుతంగ్రాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కలిసి కట్టుగానే ఉన్నామని సచిన్ పైలట్ ప్రకటించారు. ఎప్పటి వరకు నేనుంటానో అప్పటి వరకూ ప్రభుత్వం సురక్షితంగానే ఉంటుందని పైలట్ ప్రకటించారు.