ధారావి మూసివేత

ధారావి మూసివేత

ముంబై: దేశంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ఇక్కడి ధారావీలో కరోనా సోకి 56 ఏళ్ల వ్యక్తి మరణించడంతో అధికారులు మురికివాడకు సీలు వేశారు. మృతుడి కుటుంబసభ్యుల్లో 8 మందిని పరీక్షించి నిర్భంధంలోకి పంపారు. మృతుడు సమీపంలోని జామా మసీదులో ప్రార్థనలు చేసినట్లు వార్డు అధికారులు గుర్తించారు. పర్యవసానంగా ధారావీలోని ఎనిమిది భవనాల్లో 308 ఫ్లాట్లు, 91 షాపులకు సీలు వేశారు. మురికివాడ వాసులకు పౌరసంఘం నుంచి ఆహారం, నిత్యావ సరాలను ఇళ్లకే అందిస్తోంది. మురికివాడ వాసుల్లో ఇద్దరు ఢిల్లీ తబ్లిగ్ జమాత్ సమావేశానికి వెళ్లి వచ్చారని తేలడంతో వారందరినీ హోం క్వారంటైన్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos