చిందులేసి ఓవైసి

చిందులేసి ఓవైసి

ఔరంగాబాద్: ఇక్కడి ఎన్నికల ప్రచార సభలో ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చిందులేసి ఆహూతుల్ని ఆకట్టుకున్నారు. పార్టీ చిహ్నమైన గాలి పటాన్ని ఎగరేస్తున్నట్లు వేసిన చిందులు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇక్కడి పైథాన్ గేట్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. వేదిక దిగేటపులు వేసిన చిందులు కార్యకర్తల్న ఉత్తేజ పరచింది. అంతకు ముందు చేసిన ప్రసంగంలో ఆయన ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల వేళలోనే ఆయనకు వివాదాస్పద అంశాలు గుర్తుకు వస్తాయి. వీటిని లేవనెత్తి మత వాదులు, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులకు సంకేతాలు ఇస్తారు. ఇంగ్లీష్లో దీన్నిడాగ్ విజిల్ పాలి టిక్స్ అంటార’ని ధ్వజ మెత్తారు. ‘1993 బాంబు పేలుడు నిందితు లందరికీ శిక్ష పడింది. యాకూబ్ను ఉరితీశామని ప్రధాని చెబుతారని, శ్రీకృష్ణ కమిషన్ నివేదిక సూచించినట్లు బాధితులకు న్యాయం చేసేందుకు మాత్రం ఆలోచించర’ని హేళన చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos