ఆగ్గొండపల్లిలో 500 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ

ఆగ్గొండపల్లిలో 500 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ

హొసూరు : కృష్ణగిరి జిల్లా హొసూరు సమీపంలోని ఆగ్గొండపల్లి గ్రామంలో లో ఐదు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా కార్మికులందరూ ఇళ్లకే పరిమితం కావడంతో నిత్యావసర వస్తువులకు అవస్థలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. కార్మికుల కష్టాన్ని గుర్తించిన ఆగ్గొండపల్లి గ్రామస్తులు కార్మికుల కోసం బియ్యం, వంట నూనె తదితర నిత్యావసర సరుకులను అందజేసేందుకు నిర్ణయించి ఏర్పాట్లను చేశారు. అందులో భాగంగా ఆగ్గొండపల్లి సహకార సంఘం బ్యాంక్ అధ్యక్షులు ముని రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి బాలకృష్ణ రెడ్డి పాల్గొని ఐదు వందల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆగ్గొండపల్లి గ్రామస్తులు, ఏడీఎంకే పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos