ఇద్దరు భార్యల ఐఏఎస్‌ సస్పెన్షన్‌

ఇద్దరు భార్యల ఐఏఎస్‌ సస్పెన్షన్‌

గాంధీ నగర్: ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడనే ఆరోపణకు గురైన గౌరవ్ దహియా అనే ఐఏఎస్ అధికారిని గుజరాత్ ప్రభుత్వం బుధవారం సస్పెండ్ చేసింది. మొదటి భార్యకు విడాకులిస్తానంటూ నమ్మబలికి తనను రెండో వివాహాం చేసుకున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మొదటి భార్యకు త్వరలో విడాకులిస్తానని నన్ను నమ్మించాడు. అనంతరం ఫిబ్రవరిలో తిరుపతిలో మేము వివాహం చేసుకు న్నాము. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నా వద్ద ఉన్నాయి. ఆ తరువాత వివాహాన్ని రిజిస్టర్ చేయాలని నేను ఆయన్ను కోరాను. అందుకు సమ్మతించకపోగా నన్ను హింసించటం ప్రారంభించాడు.’ అని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గత నెలలో గుజరాత్ ముఖ్య మంత్రి విజయ్ రూపానీ నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక సమితినీ నియమించారు. సమితి నివేదిక ఆధారంగా ప్రభుత్వం గౌరవ్ దహియా పై చర్యల్ని తీసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos