ఒక అమ్మాయి కోసం నలుగురి ప్రాణాలు తీయడం తప్పు..

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దిశ హత్యాచార నిందితులకు ఘటనా స్థలంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలోనే పంచనామా నిర్వహించారు.ఈ క్రమంలో కేసులో నిందితుడు చెన్న కేశవులు భార్య స్పందించింది.మీడియాతో మాట్లాడుతూ… ‘ఇటువంటి కేసులు దేశంలో చాలా ఉన్నాయి కదా. దిశ తన చెల్లికి ఫోన్ చేసే బదులు వేరే ఎవరికయినా (పోలీసులకు) ఫోన్ చేయొచ్చు కదా? ఒక అమ్మాయి కోసం నలుగురి ప్రాణాలు తీయడం తప్పు సర్.. ఇది పెద్దతప్పుఅని చెప్పింది.’కోర్టు తీర్పు ఇవ్వకుండానే చంపేశారు సర్.. ఇంతగానం చేయడం తప్పు సర్. న్యాయం కాదిది అన్యాయం. మా ఆయనను ఎక్కడ చంపారో నన్నుకూడా అక్కడికే తీసుకెళ్లి చంపండిఅని ఆమె వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పు ఇచ్చాకే శిక్ష అమలు చేస్తే బాగుండేదని ఆమె అభిప్రాయపడింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos