అనంత్ నాగ్: జమ్మూ-కశ్మీర్, అనంత్నాగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ ఎం.అరవింద్ శనివారం ఉదయం తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడు, కోయంబత్తూరు నగరానికి చెందిన 33 ఏళ్ల సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం అరవింద్ తన నివాసంలో తుపాకీతో కాల్చుకున్నాడు. 2014లో సీఆర్పీఎఫ్ లో చేరిన అరవింద్ సెలవు నుంచి ఈ నెల 14న వచ్చి విధుల్లో చేరారు. ఆయన భార్య కూడా ఈ నెల 20న ఉద్యోగంలో చేరారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన సమస్యలతో అరవింద్ఆత్మహత్య చేసుకున్నాడని ఉన్నతాధి కారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు వ్యాఖ్యలు వెలువడ్డాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని కశ్మీర్ పోలీసులు చెప్పారు