అమరావతి: శాసనసభ ఆవరణలో గురువారం సంభవించిన ఘట నలపై క్రిమినల్ కేసు దాఖలు చేయాలని మార్షల్స్ ను సభా పతి తమ్మినేని సీతారాం శుక్రవారం ఆదేశించారు. ఈ ఘటనలోచంద్రబాబు, ఇతర శాసనసభ్యులతో పాటు ఉన్న ఇత రుల్ని గుర్తిం చేం దుకు పోలీ సుల సాయం తీసుకోవాలని సూచించారు. ‘గురువారం ఘటనలు అత్యంత దురదృష్టకరమైనవి. శాసన సభ రక్షణ కోసం నియమితమైన మార్షల్స్ తో దురుసుగా ప్రవర్తించడం క్షమార్హం కాని నేరం. క్రిమినల్ దాఖలు చేయాలని మార్ష ల్స్కు ఆదేశాలు జారీ చేస్తున్నాన’ని శుక్ర వారం సభలో ప్రకటించారు. తనకు ఎవరిపైనా దురభిప్రాయం లేదన్నారు.