శ్రీవారి సేవలో క్రికెటర్లు

శ్రీవారి సేవలో క్రికెటర్లు

తిరుమల : తిరుమల శ్రీవారిని క్రికెటర్లు రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్‌లు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో వచ్చి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు రోహిత్ శర్మకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఐపీఎల్ ఫైనల్స్లో ముంబై ఇండియన్స్ ప్రవేశించడంతో స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని రోహిత్ తెలిపాడు. మరో క్రికెటర్ దినేశ్ కార్తీక్ అర్చన సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఇద్దరు క్రికెటర్లకు రంగనాయకుల మండపంలో తితిదే అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos