న్యూ ఢిల్లీ : ఏఐసీసీ కార్యాలయంలో పోలీసులు చొచ్చుకుని వెళ్లి అక్కడ ఆందోళనకు దిగిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నందుకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజ్ భవన్లను ముట్టడించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పోలీసులు ఏఐసీసీ కార్యాలయం గేట్లను బద్దలు కొట్టారని,పార్టీ శ్రేణుల పట్ల దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఆందోళనకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని పార్టీ పిలుపునిచ్చింది.