పశ్చిమ బెంగాల్‌లో 16 స్థానాలకు పోటీ

పశ్చిమ బెంగాల్‌లో 16 స్థానాలకు పోటీ

న్యూఢిల్లీ: సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 16 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో చర్చలు జరుగుతున్నాయని లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ బిమన్ బసు అన్నారు. గురువారం కోలకతాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామపక్ష కూటమి నేతలతో కలిసి బిమన్ బసు మాట్లాడారు. 16 మంది అభ్యర్థులలో 14 మంది కొత్తవారని, యువకులని పేర్కొన్నారు. ”మేం 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తమ హై కమాండ్తో మాట్లాడటానికి ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్నారు. కాబట్టి, వారు తిరిగి వస్తే, ఆపై చర్చిస్తాం . ఏమి జరుగుతుందో చూద్దాం” అని బసు అన్నారు. మార్చి 16న లెఫ్ట్ ఫ్రంట్ లో భాగస్వామ్య పార్టీలైన సీపీఐ(ఎం), సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీల మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos