ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని హరిస్తున్న వైకాపా

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని హరిస్తున్న వైకాపా

విశాఖ పట్టణం: పార్లమెంట్లో వైకాపీ తీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారత్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, జగన్ అప్రజాస్వామిక, అనైతిక పొత్తు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను హరిస్తోందని ధ్వజ మెత్తారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని పోరాటాలు చేసిన వైకాపా ఇప్పుడు పార్లమెంట్లో దాని గురించి నోరు మెదపడం లేదని విమర్శించారు. దీనిపై ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని దుయ్య బట్టారు. చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే అమాయక గిరిజనులకు రక్షణ ఎవరని ప్రశ్నించారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై సీపీఎం పోరాటానికి సిద్ధమవుతోందని తెలిపారు. పుల్వామా ఘటనపై సుప్రీం కోర్టు తీర్పు మోదీకి చెంపపెట్టు లాంటిదన్నారు. భేటీ బచావో నినాదాలు ప్రచారానికే పరిమితమైందని మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos