జీవీఎల్ నోరు పడిపోయిందా?

అమరావతి:‘కేంద్రం పదే పదే ఆంధ్ర ప్రదేశ్‌ కు అన్యాయం చేస్తున్నా భాజపా నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? డిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ నిద్రపోతున్నారా? జీవీఎల్ నోరు పడిపోయిందా?’ని సీపీఐ నేత రామకృష్ణ బుధవారం ఇక్కడ దుయ్యబట్టారు.  రాజధాని నిర్మాణానికి నిధుల విడుదలపై వివక్ష చూపుతున్నారని మండి పడ్డారు. రైల్వే జోన్ ను గాలి కొదిలేశారని దుయ్యబట్టారు. ‘గతంలో చంద్రబాబు నాయుడు అడిగినా నిధులు ఇవ్వలేదు.  ఇప్పుడు కేంద్రాన్ని జగన్ అడిగే పరిస్థితి లేద’ని వ్యాఖ్యానించారు. మాట్లాడేవారు లేరనేది కేంద్రం ధీమా అని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై బీజేపీ తెలుగు నేతలు ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ నిద్రపోతున్నారా? జీవీఎల్ నోరు పడిపోయిందా? అని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos