విద్యుదాఘాతంతో పాడి పశువు మృతి

విద్యుదాఘాతంతో పాడి పశువు మృతి

హొసూరు : హొసూరు సమీపంలో విద్యుదాఘాతంతో పాడి పశువు మృతి చెందింది. మోరనపల్లి గ్రామానికి చెందిన మునియప్ప పశువులు ఆధారంగా జీవనం సాగిస్తున్నాడు.  బుధవారం రాత్రి తన పశువును ఇంటి ముందు వదలడంతో పశువు సమీపంలోని  ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుతాఘాతానికి గురై, సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నేల తడి కావడంతో ట్రాన్స్ ఫార్మర్ అమర్చి ఉన్న ప్రాంతంలో విద్యుత్ ప్రసరించి, పశువు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై  విద్యుత్ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos