మరో 67 మందికి కరోనా

మరో 67 మందికి కరోనా

అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,292 రక్త నమూనాల్ని ను పరీక్షించినపుడు 67 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్ర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఇక్కడ ప్రకటించింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,650కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 524 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు. 33 మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,093. గత 24 గంటల్లో చిత్తూరులో 1, గుంటూరులో 19, కపడలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, విశాఖపట్నంలో 6 వంతున కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 491కి చేరాయి.

తాజా సమాచారం