కరోనా చైనా సృష్టేనా?

కరోనా చైనా సృష్టేనా?

ప్రపంచ వ్యాప్తంగా మరణశాసనం లిఖిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ మెల్లిగా విస్తరిస్తోంది.భారత్‌లో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య,మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం కరోనా కోరలు చాస్తోంది.అయితే కరోనా వైరస్‌కు పుట్టినిల్లైన చైనాలో మాత్రం కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.ప్రపంచమంతటా కరోనా విజృంభిస్తుంటే చైనాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండడంతో కరోనా వైరస్‌ చైనా కుట్ర నుంచే పురుడు పోసుకుందనే ఆరోపణలు,అనుమానాలు బలపడుతున్నాయి. ఈ  వైరస్  ని  చైనా స్వయంగా సృష్టించిన వైరస్ అని ప్రపంచంలోని చాలా ఆరోపిస్తున్నాయి. దీనికి కూడా ఒక బలమైన కారణం ఉందంటున్నాయి. కొన్నేళ్లుగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న చైనా తమ దేశంలో విస్తరిస్తున్న విదేశీ పెట్టుబడిదారుల్ని ఎలా పంపించేయాలో తెలియక వైరస్ని సృష్టించిందని ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా ఐరోపా దేశాల్లో చాలా మంది దీన్ని సమర్థిస్తున్నారు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటేకరోనా వైరస్ కి  చైనా విరుగుడుకు మందును కూడా ముందే తయారుచేసుకుందని తాజా పరిస్థితులని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే విషయం    స్పష్టమవుతుందని అంటున్నారు.కరోనా వైరస్ బయటపడిన కొత్తలో చైనాలో విరివిరిగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని జనవరి వరకూ చైనాలో కరోనా వైరస్ విపరీతంగా విస్తరించింది అని అయితే గత కొన్ని రోజులుగా  కొత్త కేసులు నమోదు కావట్లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే వైరస్ వెలుగులోకి వచ్చిన తోలి రోజుల్లో వైరస్ కారణంగా మరణించిన వారు ఎక్కువగా ఉన్నారు. కానీ కరోనా ఇప్పుడు ఇతర దేశాలలో ఇంతగా ప్రభావం చూపుతున్నా కూడా ఇప్పుడెందుకు చైనాలో కొత్తగా ఎవరూ మరణించడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. చైనా లో ఇప్పటివరకు మొత్తం 81 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయితే అందులో 72440 కేసులు రికవరీ అయ్యాయి. ఇటలీ లో 53 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయితే అందులో కేవలం 6 మంది మాత్రమే రికవరీ అవ్వగలిగారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే కరోనా కి చైనా టీకాని కనుగొని ఉండవచ్చు అని పలువురు అభిప్రాయం పడుతున్నారు.
మొత్తంగా  చైనా ఒక ప్లాన్ ప్రకారం చేస్తోందని విమర్శిస్తున్నారు. చైనాలో అమెరికా యూరప్ దేశాలకు చెందిన చాలా విదేశీ పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో స్థానిక కంపెనీల్లో వాటాలు కొని లాభాలు సంపాదిస్తూ స్థానిక పారిశ్రామిక వేత్తలకు సమస్యగా మారుతున్నాయి. ప్రపంచీకరణ కారణంగా చైనా తమ దేశంలో విదేశీ పెట్టుబడిదారుల్ని బలవంతంగా పంపలేదు. ఇలాంటి వైరస్ ని సృష్టిస్తేఆటోమేటిక్ గా ఆయా పెట్టుబడిదారులు తమ వాటాలని  వెనక్కి తీసుకుంటారనే ఉద్దేశంతోనే చైనా కుట్ర పన్నిందనే వాదనపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తన ప్లాన్లో భాగంగా చైనా వుహాన్ నగరాన్ని ఎంచుకుందని. అక్కడైతే అన్ని దేశాల ప్రజలూ ఉద్యోగాలు చేస్తున్నారు చదువు కుంటున్నారు కాబట్టి అక్కడ వైరస్ని వ్యాపింపజేస్తే తమ వ్యూహం ఫలిస్తుందని చైనా స్కెచ్ వేసిందనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి. ఆరోపణలకు తగ్గట్టే చైనాలోని స్థానిక కంపెనీల్లో తమ వాటాల్ని విదేశీ పెట్టుబడిదారులు అమ్ముకున్నారు. చైనా నుంచి బయటకు వెళ్లిపోయారు. ఫలితంగా రెండు రోజుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థలో రూ.1.50లక్షల కోట్ల స్వదేశీ సంపద వచ్చింది. అయితే వ్యాఖ్యలని చైనా తీవ్రంగా ఖండిస్తోంది. మేము కరోనా కి వ్యతిరేకంగా  బలమైన చర్యలు తీసుకోబట్టే వైరస్ ఆగిందనీ అమెరికా అలా చెయ్యలేకపోగా తమను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది అని అమెరికా పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos