ఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 29 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 223కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 32 మంది విదేశీయులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాధి బారిన పడినవారిలో ఇప్పటివరకు ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్లలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు చనిపోయారు.