అమరావతి: తన వాహన శ్రేణి వల్ల ప్రజలు ఇబ్బందుల పాలు కాకుండా నివారించేందుకు ప్రత్యామ్నాయాల్ని కనుక్కోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఇక్కడ పోలీసు, తన కార్యాలయం అధికారుల్ని ఆదేశించారు. భద్రతా చర్యల్లో భాగంగా తన పర్యటనల్లో పౌరుల వాహనాల్ని నిలిపేస్తున్నందున వారు ఇబ్బందులు పడటాన్ని గమనించానన్నారు. ఇది పునరావృతం కారదని సూచించారు. దరిమిలా అధికార్లు ప్రత్యామ్నాయాల్ని సిద్ధం చేస్తున్నారు.