గుత్తేదారు కాల్చివేత

గుత్తేదారు కాల్చివేత

బీజాపూర్ :బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సమాజ్‌ వాదీ పార్టీ నేత సంతోష్‌ పూనెంను కాల్చి చంపారు. జిల్లాలోని మురి ముల్లాకు చెందిన గుత్తే దారు. సంతోష్‌ పూనెంను మంగళవారం సాయంత్రం మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం అక్కడికి పదహైదు కిమీల దూరంలోని చట్టమైన అడవిలో తరలించి అక్కడ కాల్చి చింపనట్లు యాంటి నక్సల్స్‌ ఆపరేషన్స్‌ డీఐజీ సుధేరాజ్ బుధవారం ఇక్కడ తెలిపారు. ‘పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించాం. వారి నివేదిక ఆధారంగా పూర్తి వివరాలను వెల్లడిస్తామ’ని చెప్పారు. సంతోష్ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సమాజవాది పార్టీ తరపున బీజాపూర్ నుంచి పోటీ చేసి ఓడి పోయారు. ప్రస్తుతం బస్త ర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos