విలీనం లాంఛనమేనా?

విలీనం లాంఛనమేనా?

లోక్‌సభ ఎన్నికలు,స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే కారణంతో ఆపరేషన్‌ గులాబిని వాయిదా వేయడంతో తెరాస అధినేత కేసీఆర్‌ మళ్లీ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ చేపట్టిన ఆపరేషన్‌తో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే సమయానికి 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు.ఇంకొక్క ఎమ్మెల్యే చేరితో ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ అధికార పక్షమైన తెరాసలో విలీనమై ఉండేది.అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్‌ గులాబిని తాత్కాలికంగా వాయిదా వేసిన కేసీఆర్‌ మళ్లీ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్‌ రోహిత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటీ రామారావు నుంచి రోహిత్ రెడ్డికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పార్టీలో చేరుతానని రోహిత్‌రెడ్డి కేటీఆర్‌కు చెప్పినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అన్నీ కుదిరితే త్వరలోనే రోహిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి సొంత గూటికి చేరనున్నారు. ఏడాది క్రితం టీఆర్ఎస్ నుంచి బహిష్కణకు గురైన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు.రోహిత్ రెడ్డి చేరికతో శాసనసభలో కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదా గల్లంతయ్యే అవకాశాలున్నాయి.మరోవైపు ఉత్తమ్ రాజీనామాతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 18కు తగ్గింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తమ్ రాజీనామాతో 19 కాస్త 18కి తగ్గింది.18 మంది ఎమ్మెల్యేలలో 11 మంది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోగా 7 మంది మాత్రమే మిగిలారు.ఈ ఏడు మందిలో వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్‌ రోహిత్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.కేంద్రంలో అంచనాలు తలకిందులు కావడంతో టీఆర్ఎస్ మళ్లీ కాంగ్రెసును లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos