కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి..

కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి..

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంత రావు మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.తెలంగాణలో రెండోసారి అధికారంలోకి రావడంతో కేసీఆర్ కు అహం పెరిగిపోయిందన్నారు.అధికార దాహంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయనయి ఆరోపించారు. రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని తాను కోరుకుంటున్నానన్నారు.హాజీపూర్ దారుణలాపై మానవతా దృక్పథంతో కూడా స్పందించడం లేదని వీహెచ్ విమర్శించారు. హాజీపూర్ బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ఎటువంటి సహాయం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.ఆ కుటుంబాలను పరామర్శించాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా కేసీఆర్ కు లేదన్నారు. హాజీపూర్ లో బస్సు సౌకర్యం, వంతెన నిర్మాణంపై ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి తాము పోరాటం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు.ఉమ్మడిరాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విరుచుకుపడ్డారు. గవర్నర్ కేవలం  తిరుపతి పూజారిగానే పనికొస్తాడంటూ సెటైర్లు వేశారు. డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్ ని పెడితే సెట్ అవుతారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ వినతిపత్రం ఇచ్చినా గవర్నర్ దాన్ని చెత్తబుట్టలో వేస్తున్నారంటూ వీహెచ్ ఆరోపించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos