మరో ఎన్నికల జిమ్మిక్..కాంగ్రెస్

విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఎన్నికల గిమ్మిక్కుగా కాంగ్రెస్‌ అభివర్ణించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా రిజర్వేషన్లు ఎలా కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల ఎనిమిదిన్నర నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకుందంటే అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయంగా భావించాల్సి ఉంటుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos