పంజాబ్‌లో కాంగ్రెస్‌ హవా

పంజాబ్‌లో కాంగ్రెస్‌ హవా

అమృత్‌సర్‌: పంజాబ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయపథాన దూసుకుపోతోంది. మొత్తం 117 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా, 9వేలకు మించిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఒకవైపు రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపధ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. ఈరోజు ఫలితాలు వెలువడుతున్నాయి. పాటియాలా జిల్లాలోని పతరాం నగర్ కౌన్సిల్‌లో ఆరు వార్డులు కాంగ్రెస్ ఖాతాలో, మూడు అకాలీదళ్, నాలుగు స్వతంత్ర అభ్యర్థుల ఖాతాలో చేరాయి. అదేవిధంగా నభాలో రెండు వార్డులలో అకాలీ, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి, మూడు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఫజలికాలో కాంగ్రెస్ 11 చోట్ల, అకాలీదళ్ ఐదు స్థానాల్లో, ఆమ్ ఆద్మీపార్టీ ఒక వార్డులో గెలుపొందాయి. భఠిండాలో రెండు వార్డులలో అకాలీదళ్, నాలుగు వార్డులలో కాంగ్రెస్ విజయం సాధించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos