హొసూరు పాఠశాలకు రూ.20 లక్షల కంప్యూటర్లు

హొసూరు పాఠశాలకు రూ.20 లక్షల కంప్యూటర్లు

హొసూరు : స్థానిక ముల్లై నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు న్యూజిలాండ్‌కు చెందిన దంపతులు రూ.20 లక్షల విలువ చేసే కంప్యూటర్లు, డిజిటల్ ప్రొజెక్టర్‌ను బహూకరించారు. ఈ పాఠశాలలో సుమారు అయిదు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల అభివృద్ధికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయాన్ని అందించారు. అందులో భాగంగా న్యూజిలాండ్‌కు చెందిన బ్రూస్, ఆయన భార్య క్రిస్టినా కంప్యూటర్లు, డిజిటల్ ప్రొజెక్టర్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా దంపతులను పాఠశాలలో సత్కరించారు. మేళ తాళాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు వారిని ఆహ్వానించారు. తరువాత వారికి పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా బ్రూస్ హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos