ముంబై : నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని ఎన్సీపి అధినేత శరద్ పవార్ ట్విట్టర్ లో చురక లంటించారు. ‘సీబీఐ దర్యాప్తు అపరిష్కృతంగానే మిగిలిపోతుందని నేను భావించడం లేదు. ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ కేసు విచారణను సీబీఐ 2014 లో ప్రారంభించింది. ఇంకా ముగియలేదు. దబోల్కర్ కేసు లాగా సుశాంత్ కేసు అవుతుందని భావించడం లేద’ని పరోక్షంగా సీబీఐకి పని తీరునుఎగతాళి చేసారు. సుశాంత్ కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించడాన్ని తాము గౌరవిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం సీబీఐకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు.