న్యూ ఢిల్లీ: ‘‘మోదీ ప్రభుత్వానికి వ్యవస్థలను ఏర్పరచడం చేతకాదు. దశాబ్దాలుగా ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను కూల్చడమే తెలుసు’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ శనివారం వ్యాఖ్యానించారు. కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ. సిద్ధార్థ హెగ్డే ఆత్మహత్య నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. దీనితో పాటు మాధ్యమ సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలను కూడా జతపరచారు. వీటిలో భారత ఆర్థిక వ్యవస్థ, రైల్వే గురించి ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఏఎం నాయక్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు సిబ్బందికి జీతాలు చెల్లించలేని దీనత్వం గురించి ఆయన మాట్లాడారు.