ఈ నాణేలు చలామణిలో ఉన్నాయి

ఈ నాణేలు చలామణిలో ఉన్నాయి

న్యూఢిల్లీ: 50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయని భారతీయ రిజర్వుబ్యాంకు గురువారం పునరుద్ఘాటించింది. రూపాల్లో తేడా ఉన్నా నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. నాణేలు చెల్లుబాటు కావడం లేదన్న ఉద్దేశంతో ఈ మధ్య వీటిని తీసుకునేందుకు ఎవరూ ఇష్ట పడడం లేదు. చివరికి బస్సుల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ నాణేలు రద్దయినట్లు వచ్చిన వార్తల్లో నిజం తేల్చింది. బ్యాంకులు కూడా లావాదేవీల సమయంలో నాణేలను స్వీకరించాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos