దీపావళికి రాయితీపై కో-ఆప్టెక్స్ అమ్మకాలు

దీపావళికి రాయితీపై కో-ఆప్టెక్స్ అమ్మకాలు

హొసూరు : రాబోయే దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన కృష్ణగిరిలో కో-ఆప్టెక్స్‌ ప్రత్యేక విక్రయాలను ప్రారంభించింది. డీఆర్‌ఓ శాంతి శుక్రవారం అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలుదార్లకు 30 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు సంస్థ మేనేజర్‌ బాల సుబ్రమణి తెలిపారు. వివిధ రకాల పట్టు, కాటన్‌, చేనేత వస్త్రాలను అమ్మకానికి పెట్టినట్లు చెప్పారు. ఈ దీపావళి సీజన్‌కు కృష్ణగిరి, హొసూరుల్లో రూ.1.80 కోట్ల విక్రయాలు జరపాలని లక్ష్యం విధించుకున్నట్లు వెల్లడించారు. సెలవుల్లో కూడా విక్రయాలు ఉంటాయని చెప్పారు. కాగా 1935లో ప్రారంభమైన ఈ సంస్థ చేనేత కార్మికుల వికాసానికి కృషి చేస్తోంది. 84 ఏళ్లుగా వారికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ, వారి ఉత్పత్తుల విక్రయానికి కృషి సల్పుతూ ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos