బీజేపీ విభజన రాజకీయాలు

బీజేపీ విభజన రాజకీయాలు

కోల్‌కతా: దేశాన్ని కాపాడుకోవాలనేదే మా అందరి లక్ష్యమని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భాజపా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే విపక్షాలుగా మేం ఏకం చేయాలనుకుంటున్నామని చెప్పారు. కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీలో చంద్రబాబు ప్రసంగించారు. బెంగాలీలో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్య సంగ్రామానికి పశ్చిమ్‌బంగ దశాదిశ చూపిందన్నారు. విపక్షాల ఐక్యతకు గొప్ప వేదికను ఏర్పాటు చేశారంటూ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని ప్రశంసించారు. విభజించు పాలించు అనే రీతిలో భాజపా దేశాన్ని పాలిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రైతుల కష్టాలు కేంద్రానికి పట్టడం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. పెద్ద నోట్ల రద్దే అందుకు నిదర్శనమని చెప్పారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు దుయ్యబట్టారు. పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని.. ధరల పెరుగుదలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రాల హక్కు కాలరాసి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos