అమరావతి: అత్యవసర వైద్య సేవలకు త్వరలోనే వెయ్యి ‘108 అంబులెన్సులు రానున్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గురువారం ట్వీట్ చేసారు. చంద్రబాబు హయాంలో 108 వాహనాలు మూలన పడ్డాయని, 104 సంచార వైద్యశాలలు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. త్వరలోనే మండలానికి ఒకటి చొప్పున 104 సంచార వైద్యశాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.