‘చింతమనేని’ కోసం గాలింపు

‘చింతమనేని’ కోసం గాలింపు

ఏలూరు: మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని జిల్లా పోలీసు సూపరెం టెండెంట్ నవదీప్ సింగ్ గ్రేవాల్ గురువారం ఇక్కడ తెలిపారు. ఆయనపై ఇప్పటి వరకూ 50 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోలీసులు తప్పుడు కేసులు బనాయి స్తున్నారని ఆయన చేసిన ఆరోపణప అవాస్తవమని కొట్టిపారేశారు. ఇద్దరు ఏఎస్ఐల పట్ల దురుసుగా ప్రవర్తించటంతో పాటు ఇతరుల ఫిర్యాదు ప్రకా రమే కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం దర్యాప్తు చేస్తుననామని వివరించార. చింతమనేని అనుచరులు తనను బెదిరిస్తున్నారని జోసెఫ్ అనే వ్యక్తి ఏలూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. అవసరమైతే జోసెఫ్కి పోలీస్ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. చింతమనేనికి వ్యతిరేకంగా నమోదైన కేసుల్ని విచారించకుండా జాప్యం చేసిన అధికార్లపై శాఖాపరంగా విచారణ చేస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉద్దేశ పూర్వకంగానే పోలీసులు సరిగా దర్యాప్తు చేయలేదని తేలితే వారిపై చర్యల్ని తీసుకుంటామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos