చోటా రాజన్ కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష

చోటా రాజన్ కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష

ముంబై: ప్రముఖ వ్యాపారి, హోటల్ యజమాని బీఆర్ శెట్టి హత్యా యత్నం కేసులో బంధిపోటు చోటా రాజన్ కు ఇక్కడి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇతర నిందితులు- షార్ప్ షూటర్ రోహిత్ తంగప్ప, నిత్యానంద్ నాయక్, సెల్విన్ డేనియల్, దిలీప్ ఉపాధ్యాయ్, తల్విందర్ సింగ్ భక్షి, గురుదీప్ సింగ్ కు తలా రూ.5 లక్షల వంతున జరిమానా విధించింది. హోటల్ యజమానులు, భవన నిర్మాణ దారులలో భయాందోళనలను పెంచేందుకు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరాత్ తన వాదనల్లో పేర్కొ న్నారు. పక్కా వ్యూహంతో చోటా రాజన్ ముఠా ఈ దారుణానికి పాల్పడిందని చెప్పారు. గురుదీప్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. క్రైం జర్నలిస్టు జె.డేను హత్య చేసినందుకు చోటా రాజన్కు గత ఏడాది జీవితకాల శిక్ష పడింది. ఇదే కేసులో రోహిత్ తంగప్పకు కూడా యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. నకిలీ పాస్ పోర్టు కేసులో కూడా చోటా రాజన్ శిక్షను అనుభవి స్తున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos