వైసీపీ వైపు చిరు చూపు!

వైసీపీ వైపు చిరు చూపు!

ప్రజాసేవ కోసం 2009లో ప్రజారాజ్యం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి అటుపై పార్టీని నడిపించడంలో విఫలమైన మెగస్టార్‌ చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పార్టీలో ఉన్నత పదవులను అనుభవించిన చిరంజీవి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి, సినిమాలపై దృష్టిని సారించారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరమై సినిమాలపై మాత్రమే దృష్టి సారించిన చిరంజజీవి తాజాగా వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారాలు ఊపందుకున్నాయి.కొంతకాలం క్రితం ఏపీ సీఎం జగన్ తో భేటీ తరువాత, చిరంజీవి వైసీపీలో చేరాలని భావిస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే, తాను నటించినసైరాచిత్రాన్ని చూడాలని కోరడానికే జగన్ ను చిరంజీవి కలిశారన్న వివరణ వచ్చింది.వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను చేసిన తరువాత, అనూహ్యంగా చిరంజీవి దానికి మద్దతు పలికారు. మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం ముందడుగు వేస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో చిరంజీవి వైసీపీలో చేరుతారన్న వార్తలకు బలం చేకూరింది. అతి త్వరలో ఇందుకు ముహూర్తం కుదురుతుందని, జగన్ తో చిరంజీవి చేతులు కలిపేది ఖాయమని చిరంజీవికి రాజ్యసభ ఇవ్వడానికి సైతం వైఎస్‌ జగన్‌ ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos